home page

ఒకే దేశం -ఒకే చట్టం సాధ్యమా?

బీజేపీ లక్ష్యం ఏమిటో? ఈశాన్య భారతానికి  మినహాయింపు? పార్సిల సంగతేంటి?

 | 
Hindu constitution
*ఒకే దేశం ఒకే చట్టం–ఉమ్మడి పౌరస్మృతి*
బీజేపీ ఇచ్చిన ఎన్నికల మేనిఫేస్టోలో ఉన్న ఒక్కొక్క హామీని బీజేపీ అమలు చేసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఇచ్చిన హామీల్లో అతి ముఖ్యమైన ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. త్వరలోనే పార్లమెంటు ముందుకు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశ పెట్టాలని చూస్తోంది.ఉమ్మడి పౌరస్మృతి బీజేపీ ఎన్నికల మేనిఫేస్టోలోని అతి ముఖ్యమైన హామీ. నరేంద్ర మోదీ సర్కార్.. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్‌ను కూడా వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసి.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగించుకోవాలని కాషాయ పార్టీ తీవ్రంగా యోచిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై మూడో వారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశంలోనే బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియను ఇప్పిటికే ప్రారంభించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. యూనిఫామ్ సివిల్ కోడ్ - యూసీసీని అమలు చేసి ఒకే దేశం - ఒకే చట్టం తీసుకురావాలని మోదీ సర్కార్ భావిస్తోంది.స్టాండింగ్ కమిటీ ముందుకు జులై నెల మూడో వారంలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు.. దాని బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని దీనికి సంబంధం ఉన్న ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన బిల్లును పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ ముందు కూడా ప్రవేశపెట్టబోతోందని సమాచారం. దీనిపై ఇప్పటి వరకే చాలా మంది పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఉమ్మడి పౌరస్మృతి అంశంపై లా కమిషన్‌, న్యాయ మంత్రిత్వ శాఖలు కూడా వారి అభిప్రాయాలను తెలియజేయాలని జూన్ 14 వ తేదీనే నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జులై 3 వ తేదీన లా కమిషన్‌, న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో సమావేశం జరగనుంది. ఇందులో సభ్యుల అభిప్రాయాలు, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయం వంటి అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దీన్ని మరింత వేగవంతం చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదట పాత పార్లమెంట్‌ భవనంలో నిర్వహించి.. తర్వాత కొత్త భవనంలోకి మార్చనున్నారు.విపక్షాలపై మోదీ విమర్శలు ఉమ్మడి పౌరస్మృతి అంశంపై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా సున్నితమైన అంశమని.. దీననిపై దేశంలోని ప్రతిపక్షాలు ముస్లింలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. అన్ని కులాలు, వర్గాల ప్రజలకు ఒకే రకమైన చట్టాలు ఉండాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. సుప్రీంకోర్టు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్‌ను సమర్థించిందని ప్రధాని గుర్తు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే వారు మాత్రమై దీన్ని వ్యతిరేకిస్తున్నారని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానిం చారు. ఒక దేశానికి రెండు చట్టాలు ఎలా ఉంటాయని ఈ సందర్భంగా మోదీ ప్రశ్నించారు.అసలు ఏంటీ యూనిఫామ్ సివిల్ కోడ్ భారతదేశం లోని ప్రజలందరికీ ఒకటే రాజ్యాంగం ఉంది. కానీ వేర్వేరు మతాలకు చెందినవారికి వేర్వేరు చట్టాలు ఉన్నాయి. అయితే క్రిమినల్ కేసుల్లో దేశ పౌరులందరికీ ఒకే చట్టం అమల్లో ఉన్నా.. సివిల్ చట్టాల్లో మాత్రం వ్యత్యాసాల ఉన్నాయి. వివాహం, వారసత్వానికి సంబంధించి మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఒక్కో మతానికి ఒక్కో రకమైన చట్టాలు ఉన్నాయి. ప్రపంచంలోని మిగితా ఏ దేశంలోనూ లేని విధంగా మతాల ఆధారంగా ఒక్క భారత దేశంలోనే చట్టాలు అమలు అవుతూ ఉన్నాయి. అయితే క్రిమినల్ చట్టాల లాగానే సివిల్ చట్టాలు కూడా దేశ ప్రజలందరికీ ఒకేరకంగా ఉండే విధంగా చేయడమే యూనిఫామ్ సివిల్ కోడ్. అయితే దీనిపై సుదీర్ఘ కాలంగా దేశంలో భిన్నాభిప్రాయాలు, వివాదాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకువచ్చి ఒకే దేశం ఒకే చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.