home page

నోట్ల రద్దుపై అఫిడివిట్ వేయలేదా ? అవమానం !

కేంద్రంపై సుప్రీం ఆగ్రహం  

 | 
Sc

*న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు)*

_*నోట్ల రద్దుపై అఫిడవిట్ ఆలస్యం.. అవమానం అంటూ కేంద్రంపై సుప్రీం ఫైర్.. వారం డెడ్​లైన్!*_

*పెద్ద నోట్ల రద్దు అంశంపై అఫిడవిట్ సమర్పించడంలో విఫలమైన కేంద్రంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.*

*- వారం రోజుల్లోగా సవివర నివేదిక సమర్పించాల్సిందేనని తేల్చిచెప్పింది.*

*- రాజ్యాంగ ధర్మాసనం విచారణను వాయిదా వేయడం కోర్టుకు అవమానకరమని పేర్కొంది.*

★ పెద్ద నోట్ల రద్దు అంశంపై అఫిడవిట్ దాఖలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 

★ రాజ్యాంగ ధర్మాసనం విచారణను వాయిదా వేయడం కోర్టుకు అవమానకరమని పేర్కొంది. 

★ 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. సవివర అఫిడవిట్ సమర్పించాలని అక్టోబర్ 11న కేంద్రం, ఆర్​బీఐకి నోటీసులు జారీ చేసింది. 

★ నోట్ల రద్దు సమయంలో ఆర్​బీఐకి కేంద్రం రాసిన లేఖలు, ఆర్​బీఐ బోర్డు నిర్ణయాలు, నోట్ల రద్దు ప్రకటనలకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.

★ ఈ అంశం బుధవారం జస్టిస్ ఎస్ఏ నజీర్​తో సహా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందుకు రాగా.. సమగ్ర అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్రానికి మరింత సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. 

★ అఫిడవిట్ సమర్పించడంలో జాప్యానికి క్షమాపణ చెప్పిన ఆయన.. మరో వారం గడువు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. 

★ దీనికి స్పందించిన కోర్టు అటార్నీపై అసనహనం వ్యక్తం చేసింది. 

★ _*"సాధారణంగా రాజ్యాంగ ధర్మాసనం ఇలా వాయిదా పడదు. మేము ఇలా లేచి వెళ్లిపోలేము. ఇది కోర్టుకు చాలా అవమానకరం"*_ అని వ్యాఖ్యానించింది. 

★ దీనికి స్పందించిన అటార్నీ.. తనకు కూడా ఇది ఇబ్బందికరంగానే ఉందని చెప్పారు.

★ ఈ నేపథ్యంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సైతం తమ అభిప్రాయాలు వెల్లడించారు. 

★ _*'రాజ్యాంగ ధర్మాసనాన్ని వాయిదా వేయాలని కోరడం అసాధారణం. మా వాదనలను కొనసాగించేందుకు అనుమతించండి. ఆర్​బీఐ, కేంద్రం తమ అఫిడవిట్లు దాఖలు చేసేందుకు సమయం తీసుకోవచ్చు'*_ అని సీనియర్ అడ్వొకేట్ శ్యామ్ దివాన్ పేర్కొన్నారు. 

★ అయితే, న్యాయవాదుల వాదనలను విన్న ధర్మాసనం.. వారంలోగా అఫిడవిట్లు సమర్పించాల్సిందేనని కేంద్రం, ఆర్​బీఐకి స్పష్టం చేసింది. 

*విచారణను నవంబర్ 24కు వాయిదా వేసింది.*