home page

మందిర్-మసీద్ వివాదంలో యధాస్థితికి సుప్రీం ఆర్డర్

వారణాసి జిల్లా సీనియర్ జడ్జి కేసు విచారించాలి

 | 
Sc
వివాదాస్పదమైన వారణాసి కేసును సీనియర్ జిల్లా జడ్జి విచారించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. మే 17 న ఇచ్చిన ఆదేశాలు అమలులో ఉంటాయని కూడా స్పష్టం చేసింది. జస్టిస్ డి వై చంద్ర చూడ్, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన ముగ్గురు సభ్యులు ధర్మాసనం తాజా ఆదేశాలు ఇచ్చింది. 1991, నాటి ప్రార్ధనా స్థలాలు చట్టం పరిధిలోనే యధావిధి పరిస్థితి కొనసాగాలని చంద్ర చూడ్ పేర్కొన్నారు. శివలింగం కనుగొన్న ప్రదేశాన్ని పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని,అదే సందర్భంలో ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి పరిస్ధితులు కల్పించాలని , వాజు నిర్వహించుకోవడానికి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్ ను ఆదేశించింది.