home page

మక్కాలో తవ్వినా శివలింగం బయటపడుతుంది: మౌర్య

కోర్టు ఆదేశాలు తర్వాత యూపి డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు 

 | 
Mourya

మసీదు లో సోమవారం పూర్తైన ఏఎస్ఐ తనిఖీలు

జ్ఞానవాపి మసీదులో జరిపిన సోదాల్లో శివలింగం బయటపడటం చాలా సంతోషంగా ఉందని  యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు.

సౌదీ అరేబియాలోని మక్కాలో తవ్వకాలు జరిపితే అక్కడా శివలింగం కనిపిస్తుందంటున్నారు. ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన ఇంటర్వ్యూలో..

“అప్పటి రోజుల్లో మేం కాశీ విశ్వనాథ్ గుడికి వెళ్లినప్పుడు మాతా శ్రింగార్ గౌరీని దర్శించుకుని ప్రార్థనలు చేసేవాళ్లం. ఇప్పుడు ఉద్యమించాం. జ్ఞానవాపిలో మహాదేవుని విగ్రహం కనిపించడం చాలా సంతోషంగా ఉంది. మక్కాలో తవ్వకాలు జరిపినా మహాదేవుని విగ్రహాలు కనిపిస్తాయనే నమ్మకముంది” అని వెల్లడించారు.

జ్ఞానవాపిలో బయటపడ్డ శివలింగం, ఇతర వస్తువులు వివాదం చేస్తున్న వాళ్లకు సమాధానంగా మారాయి. మహాదేవుని విగ్రహం బయటపడటం ఆ భక్తులకు చాలా సంతోషాన్ని తెచ్చిపెట్టిందని మౌర్య పేర్కొన్నారు.