నవనీత్ కౌర్-రవిరాణాలకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
హనుమాన్ చాలీసా తెచ్చిన తంటా
Updated: Apr 24, 2022, 18:18 IST
| శివసేనతో సై అన్న నవనీత్ కౌర్-రవిరాణా
ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంతో మహారాష్ట్రకు చెందిన ఎంపీ నవనీత్, కౌర్-రవిరాణా ఎమ్మెల్యే దంపతులకు స్ధానిక ఆదివారం జుడీషియల్ రిమాండ్ విధించింది. శనివారంనాడు ముఖ్యమంత్రి థా కరే ఇంటి వద్ద హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించారు. దాంతో
ముంబైలో పోలీసులు నవనీత్ కౌర్-రవిరాణా దంపతులను అరెస్టు చేసి ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు వీరిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. కేంద్రం రెండురోజుల క్రితం నవనీత్ కౌర్-రవిరాణా కు 'వై' కేటగిరీ భద్రతను కల్పించేందుకు చర్యలు తీసుకుంది. సిఆర్పీఎఫ్ పోలీసులు వీరికి భద్రత కల్పిస్తారు.