home page

యూపీలో లౌడ్ స్పీకర్లు బంద్

 ఉత్తర్వులు జారీచేసిన         యోగీ సర్కారు 

 | 
Loud speakers

మతపరమైన ఊరేగింపులు నిషేధం

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లౌడ్ స్పీకర్లపై సంచలన నిర్ణయం తీసుకుంది.మతపరమైన ప్రదేశాల్లో అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగించాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.చట్టవిరుద్ధమైన లౌడ్‌స్పీకర్‌లు, మతపరమైన ప్రదేశాల్లో సౌండ్ లిమిట్ నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తొలగించేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఉత్తరప్రదేశ్ హోం శాఖ పోలీసులను ఆదేశించింది.ఏప్రిల్ 30వతేదీలోగా అన్ని స్థలాల జాబితాను తయారు చేసి హోం శాఖకు పంపాలని పోలీసు స్టేషన్‌లకు ఆదేశాలు జారీ చేశారు.