ఎల్ఐసి ఐపిఓ మే 4 నుంచి
ఐపీఓ రాకుంటే నిధులకు కటకట
Updated: Apr 26, 2022, 08:10 IST
| 30వేల కోట్ల రూపాయల మేరకు పరిమితం
ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్ కేంద్ర ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారింది. ఇష్యూ రాకుంటే కేంద్ర ద్రవ్యలోటు భారీగా పెరిగే ప్రమాదముంది. దీంతో ఎలాగైనా సరే… ఎల్ఐసీ ఆఫర్కు ప్రభుత్వం రెడీ అయిపోయింది.
అవసరమైన చోటల్లా మార్పులు చేస్తోంది. పబ్లిక్ ఆఫర్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో మోజు తగ్గేసరికి… ఎల్ఐసీ విలువను సగానికిపైగా తగ్గించేసింది. అలాగే పబ్లిక్ ఆఫర్ కింద కంపెనీ ఈక్విటీలో 5 శాతం చేయాలి. అయితే దీనికి సెబి నుంచి ప్రత్యేక మినహాయింపు తీసుకుని కేవలం 3.5 శాతం వాటాను మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇష్యూ నుంచి రూ. 21,000 కోట్లను ప్రభుత్వం సమీకరించనుంది. ఇష్యూ మే నెల 4 నుంచి 9వ తేదీ లోగా ఆఫర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రేపు ఎల్ఐసీ బోర్డు సమావేశం ఉంది. కొత్త ప్రాస్పెక్టస్ను కూడా సెబి వద్ద రేపే దాఖలు చేయనుంది.
గతంలో ప్రభుత్వ రంగ సంస్ధ లకు నిధులు అ వసరమైన సందర్భంలో ఎల్ఐసి నుంచి నిధులను మళ్ళింది.
ంంంంంంంంమ
ళ్ ం