home page

నాలుగేళ్ళలో 85 వేల రైతులకు భరోసా

రాజుగా మారిన రైతు

 | 
Kcr

★ అన్నదాత కుటుంబానికి అండగా 

★ రైతుబీమాతో సీఎం ఆర్థిక భరోసా

★ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

★ నేటితో పథకానికి నాలుగేండ్లు

★ 85 వేల కుటుంబాలకు బాసట

★ రూ.4,290 కోట్ల పరిహారం చెల్లింపు

★ పథకం పరిధిలోకి మరో 3 లక్షలు

★ రూ.1,446 కోట్ల ప్రీమియం 
     చెల్లించనున్న రాష్ట్ర ప్రభుత్వం

పెద్దదిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. నేనున్నానంటూ వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నది. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ‘రైతుబీమా’ పథకంతో కొత్త జీవితాన్ని ఇస్తున్నది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ 2018 ఆగస్టు 15న ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. నేటి (సోమవారం)తో నాలుగేండ్లు పూర్తిచేసుకొంటున్న ఈ పథకం కింద 18 నుంచి 59 ఏండ్ల వయసున్న రైతు పేరిట కనీసం కుంట భూమి ఉండి ఏ కారణంతో మరణించినా ఆయన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతున్నది.

ఇలా గత నాలుగేండ్లలో వివిధ కారణాలతో మరణించిన 85,804 మంది రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తగా రూ.4,290 కోట్ల పరిహారం చెల్లించింది. ఈ పథకం కోసం ఎల్‌ఐసీకి రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఏటా ఒక్కో రైతు తరఫున రూ.4 వేలు చొప్పున గత నాలుగేండ్లలో రూ.4,367 కోట్ల ప్రీమియం చెల్లించింది. ఏటా ప్రీమియం పెరుగుతుండటంతో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతున్నది. ఈ ఏడాది 37.76 లక్షల మంది రైతుల కోసం రూ.1,446 కోట్ల ప్రీమియంను చెల్లించనున్నది. నిరుటితో పోల్చితే ఈ ఏడాది సుమారు 3 లక్షల మంది రైతులు కొత్తగా రైతుబీమా పథకం పరిధిలోకి రావడం గమనార్హం.