home page

ఆప్ కు అధికారం ఇస్తే ఏసి రైలులో అయోధ్య టూర్

గుజరాత్ లో ఒక వృద్ధురాలికి కేజ్రీవాల్ హామీ

 | 
Kejriwal

రాజ్ కోట్ లో 'ఆప్ 'కు బ్రహ్మరధం

గుజరాత్ ఓటర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ వినూత్నంగా హామీ ఇచ్చారు. ఓటర్లు తమ పార్టీ కి ఓటేసి అధికారం అప్పగిస్తే గుజరాతీయులకు అయోధ్య లోని రామాలయం సందర్శించి వచ్చే విధంగా ఏసి రైలులో ప్రయాణం ఏర్పాటు చేస్తనని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఓ వృద్ధ మహిళ  అయోధ్య చూడాలన్న కోరిక వెల్లడి చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏసి రైలులో అయోధ్య టూర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. తాను ఇంజనీర్ నని, గట్టి గా పనిచేసతానని అంతే తప్ప రాజకీయం చేయనని కేజ్రీవాల్ చెప్పారు.