home page

ఇక హిందీ అనివార్యం!

అమిత్ షా కమిటీ సిఫార్సు

 | 
Amit shah

  • ఇంగ్లీష్‌ స్థానంలో క్రమంగా హిందీ

న్యూఢిల్లీ : ఆంగ్ల భాషను దేశం నుండి మెల్లమెల్లగా వెళ్లగొట్టాలని మోడీ సర్కార్‌ గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. విద్యా సంస్థల్లో బోధన ఆంగ్ల భాషలో ఉండరాదని, ఇంగ్లీష్‌ భాష వాడుతున్న చోట క్రమంగా హిందీని ప్రవేశపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదిక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కొద్దిరోజుల క్రితం చేరుకుంది. ఇంగ్లీష్‌ తప్ప మరో భాష అర్థం కాదని భావించిన చోటమాత్రమే, ఆంగ్ల భాషల్లో అధికారిక ఆదేశాలు, సూచనలు ఉండాలని నివేదికలో కమిటీ పేర్కొన్నది. విద్యా సంస్థల్లో, సెంట్రల్‌ వర్సిటీల్లో బోధన స్థానిక భాష లేదా హిందీ భాషల్లో మాత్రమే ఉండాలని, అన్ని రకాల టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ సంస్థల్లో పాఠ్యాంశాల్ని హిందీ లేదా స్థానిక భాషల్లో బోధించాలని కమిటీ పేర్కొన్నది. ఆంగ్ల భాషను వాడటం కేవలం ఆప్షనల్‌ (ఐచ్ఛికం)గా ఉండాలని చెప్పింది.
టెక్నికల్‌ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్‌, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ.. మొదలైన వాటిల్లో హిందీ మాధ్యమంలోనే బోధన ఉండాలని పేర్కొన్నది. ''శిక్షణా సంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలి. రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో ఆంగ్ల భాషా ప్రశాుపత్రాన్ని తొలగించాలి. నియామక పరీక్షల్లో ఆంగ్లానికి ప్రాధాన్యత ఇస్తునాురు. దీనిని మార్చాలి. హిందీ ప్రశు పత్రాన్ని తప్పనిసరిగా చేర్చాలి'' నివేదిక పేర్కొన్నది. ఇక సంబంధిత హైకోర్టు ఉత్తర్వులకు హిందీ అనువాదాన్ని తగిన విధంగా ఏర్పాటు చేయాలని, హైకోర్టు విచారణకు హిందీలో అవకాశం కల్పించాలని కూడా కమిటీ కోరింది. హిందీ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు హిందీ భాషలో పనిచేయనట్టయితే హెచ్చరించాలని తెలిపింది. హిందీ భాషను వాడకుండా పనిచేస్తున్న అధికారులను గుర్తించి హెచ్చరించాలని, వారి నుంచి వివరణ తీసుకోవాలని కమిటీ కోరింది. సంతృప్తికరమైన సమాధానం రాకపోతే, వారి వార్షిక పనితీరు అంచనా నివేదికలో నమోదు చేయాలని చెప్పింది.