బకాయిలు చెల్లించకపోతే వాహనాలు సమకూర్చేలేం
17 కోట్లు ఇవ్వాలని రవాణాశాఖ అధికారులు లేఖ
May 12, 2022, 16:19 IST
| సీఎం కాన్వాయ్ కోసం జిల్లాల్లో అధికారులు పాట్లు
సీఎం పర్యటనలకు వాహనాలు
సమకూర్చలేం: రవాణా శాఖ లేఖ
అమరావతి: సీఎం, వీఐపీల కాన్వాయ్ల బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వానికి రవాణాశాఖ లేఖ రాసింది. మూడేళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలు రూ.17.5 కోట్లు వెంటనే చెల్లించాలని.. లేని పక్షంలో సీఎం, ఇతర ముఖ్య నేతల జిల్లాల పర్యటనలకు వాహనాలు సమకూర్చలేమని లేఖలో రవాణా శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఇటీవల రవాణా శాఖ నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు ఈ అంశాన్ని ఆ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఒంగోలు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బకాయిలు తీర్చాలని అధికారులు విన్నవించారు. సీఎం జిల్లాల పర్యటనలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో కాన్వాయ్లోని వాహనాల ఏర్పాటు కోసం తక్షణం బిల్లులు చెల్లించాలని కోరారు. వీఐపీల కాన్వాయ్ల కోసం ఏటా కనీసం రూ. 4.5కోట్లు అవసరమని రవాణా అధికారులు లెక్క వేశారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయించి, ప్రత్యేక ఖాతా ద్వారా వాహనాల బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో రవాణా శాఖ పేర్కొంది.