కాకాణికి నోటీసు ఇచ్చిన హైకోర్టు
కోర్టు చోరీ కేసులో సిబిఐ కి ఓకే
Updated: Apr 26, 2022, 15:29 IST
| కేసు పురోగతి పై డిజిపి నివేదిక ఇవ్వాలి
నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి చోరీకి గురైన ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరిపింది. ఈసందర్భంగా కేసును సీబీఐకి అప్పగించడంపై అభ్యంతరం లేదని ఏజీ వివరించారు.
దీంతో సీబీఐ డైరెక్టర్, డీజీపీ, మంత్రి కాకాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. అనంతరం విచారణను మే 6కు న్యాయస్థానం వాయిదా వేసింది.