home page

రుషికొండను మింగేస్తున్న అధికార అనకొండ

పర్యావరణ పరిరక్షణకు ఒకే ఒక్కడు సాహసం

 | 
బుల్డోజర్

గ్రీన్ ట్రిబ్యునల్ కు పీతల మూర్తి యాదవ్

విశాఖలో రుషి కొండ చిరునామా మారిపోతోంది.కంటి ఎదుటే కరిగిపోయి చరిత్ర కాలగర్భంలో కలిసిపోతోంది. అధికారమనే అనకొండ రుషికొండను మింగేసింది. విశాఖకు చిరునామా అంటే ఉక్కు కర్మాగారం ఒక్కటే కాదు.విశాఖ అంటే రుషికొండ.  అదితెలియని వారు ఉండరు. అక్కడ ఉన్న టూరిజం కాటేజీ నుంచి సముద్రాన్ని ఆస్వాదించడం ఓ అద్భుతమైన అనుభవం. అలాగే అలల దగ్గర నిలబడి రుషికొండను చూస్తే నే అబ్బుర పరుస్తుంది.అదొక అద్భుతం.ఆ అనందం వర్ణనాతీతం.అయితే ఇది నిన్నటి నిజం.అది ఇప్పుడు వైసీపి జగనిజం. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం.

ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కానీ ఇప్పుడు రుషికొండ ను ఎలాగూ చూడలేరు. ఎందుకంటే కొండ చుట్టూ తవ్వేశారు. ఒక్క పైభాగం మాత్రం ఉంది. దాన్ని కూడా ఉంచుతారా తీసేస్తారా అన్నది ఎవరికీ తెలియదు. ఎందుకంటే అసలు ఆ రుషికొండపై ఉన్న టూరిజం కాటేజీలని ఎందుకు తొలగించారో.. అక్కడ ఏం కడుతున్నారో అధికారికంగా ఎవరికీ తెలియదు. అంతా జగన్మాయ. అధికారుల గూడుపుఠాణి నడుస్తోంది.

సీఆర్‌జెడ్ అనుమతులు తెచ్చుకున్నామని చెబుతున్నారు కానీ.. నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చినదానికి తవ్వేసినదానికి అసలు పొంతన లేదు. కొండ ప్రాంతం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి. మరో వైపు రుషికొండను తొలిచి అదంతా.. సముద్ర తీరంలో పారబోస్తున్నారు. ఇలా చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమే. కానీ పట్టించుకునేవారు లేరు. ఎన్జీటీకి ఫిర్యాదులు చేసినా ఎవరూ పరిగణనలోకి తీసుకోడం లేదు.

ఇప్పుడు విశాఖకు మణిహారంలో ఉన్న రుషి కొండ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. తీరానికి దూరంగా ఉన్న కొండలపై ఐటీ కంపెనీలు.. హౌసింగ్ ప్రాజెక్టులు కట్టారు కానీ ఇంత విధ్వంసం చేయలేదు. సముద్ర తీరంలో ప్రకితి రక్ష మాదిరిగా ఉన్న కొండను మాత్రం నామరూపాల్లేకుండా తవ్వేస్తున్నారు. ఏ మాత్రం బాధ్యత లేని పాలకులు అని సామాన్య జనం అనుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.

Murthy yadav

ఒకే ఒక్కడు దీని గురించి పోరాటం మొదలుపెట్టాడు.అతడే పీతల మూర్తి యాదవ్. ఏడాది క్రితం విశాఖ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో 22 వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికై పర్యావరణం పైన, పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి. రుషికొండను కాపాడాలని పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసువేశారు.