వైఎస్ వివేకా కేసులో బెయిల్ పిటిషన్లపై నిర్ణయం వాయిదా
మళ్ళీ వచ్చే గురువారం విచారణ

దస్తగిరి వాంగ్మూలాన్ని సమర్ధించిన ఏ-5 : దర్యాప్తు సంస్థ సీబీఐ
ఈ కేసులో అరెస్టైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్లు తమకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై ఇదివరకే విచారణ చేపట్టిన హైకోర్టు గురువారం మరోమారు విచారించింది.
ఈ కేసులో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిందని, ఈ సమయంలో నిందితులకు బెయిల్ ఇస్తే కేసు ఎలాంటి ప్రభావితం అయ్యే అవకాశాలు లేవని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న కోర్టు...కేసు దర్యాప్తునకు ఇంకెంత సమయం పడుతుందని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారులను అడిగి వివరాలను కోర్టుకు తెలియజేస్తామని సీబీఐ లాయర్ కోర్టుకు విన్నవించారు. దీంతో నిందితుల బెయిల్పై నిర్ణయాన్ని కోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది.