home page

పీకే సలహాలు, సూచనలు తీసుకుంటాం: పేర్ని నాని

2024లో ఒంటరిగానే పోటీ చేస్తాం

 | 
Perni nani

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అంత సీన్ లేదు

ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు, తెలివితేటలు వాడుకుంటాం: పేర్ని నాని

విజయవాడ : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు, తెలివితేటలు మాత్రమే వాడుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఒంటరిగానే పోటీ చేస్తుందని, తమకు ఎవరితో పొత్తులు అవసరం లేదని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మా ఎంపీల ఓట్లు అవసరం అయితే ఎవరికైనా మద్దతు ఇస్తామన్నారు. ఎన్నికల అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చే వారికే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు, తెలివితేటలు మాత్రమే వాడుకుంటామని తెలిపారు. వైకాపాను శాసించే ఏకైక వ్యక్తి జగన్​ మాత్రమేనన్నారు. మే 2వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలోకి వెళ్తామని, ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు.