home page

ముంబైలో శ్రీ వారి ఆలయం భూమి కేటాయించిన మహారాష్ట్ర

భక్తులకు మరింత వేగంగా సేవలు:టిటిడి

 | 
Ttd meeting

త్వరలో సర్వదర్శనం టిక్కెట్ కేటాయింపులు

తిరుపతి తిరుమల దేవస్థానం పాలకమండలి సమావేశంలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం పరిపాటి అయ్యింది.ఈ సారి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సర్వదర్శనం టిక్కెట్ కేటాయింపులో పారదర్శకంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు సూచించారు. నవీ ముంబైలో నిర్మించ తలపెట్టిన శ్రీ వారి ఆలయ నిర్మాణం వ్యయాన్ని రేమాండ్ కంపెనీ యజమాని సింఘానియా భరిస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీ వారి ఆలయ నిర్మాణం కోసం కొంత మేరకు భూమిని టిటిడికి అప్పగించింది. మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాకరే ఈ మేరకు ధృవీకరణ పత్రాలు టీటీడీకి శనివారంనాడు అందజేశారు.

ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

మహారాష్ట్రలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించిందని త్వరలోనే భూమి పూజ నిర్వహించి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన రూ. 500 కోట్ల విలువైన భూమిలో ఆలయం నిర్మించటానికి రేమాండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారని వైవీసుబ్బారెడ్డి చెప్పారు.

సామాన్య భక్తులుకు తర్వతరగతిన దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని … మే 5వ తేదీనుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తామని ఆయన తెలిపారు. శ్రీవారి ఆలయంలో రూ. 3.61 కోట్ల రూపాయలతో రెండు బంగారు సింహసనాలు తయార చేయిస్తున్నామని…పద్మావతి మెడికల్ కాలేజిలో రూ. 21 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టన్నన్నట్లు ఆయన చెప్పారు.

శ్రీనివాస సేతు మొదటి దశ పనులు పూర్తి అయ్యాయని.మే 5వ తేది సీయం జగన్ చేతులు మీదుగా ప్రారంభిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీనివాస సేతు 2వ దశ పనులుకు రూ.100 కోట్లు కేటాయించామని.. మార్చి 2023 కి పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఐఐటి నిపుణలు సూచన మేరకు ఘాట్ రోడ్డులో పటిష్ట చర్యలు తీసుకోవడానికి రెండు దశలలో రూ.36 కోట్లు కేటాయించారు.
వసతి గదులు మరమత్తులుకు రూ. 19 కోట్లు, బాలాజినగర్లో 2.86 ఏకరాల స్థలంలో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్నారు. వస్తూ రుపేణా విరాళాలు అందించిన భక్తులుకు ప్రివిలేజస్ ఇవ్వాలని…. ఆస్థాన సిద్దాంతిగా వేంకట కృష్ణ పూర్ణ సిద్దాంతిని నియమించారు. తిరుమలలోని 737 ఉద్యోగులు క్వార్టర్స్ కు మరమత్తులు చేయించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్ధలాలు కేటాయింపు చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ లో నిర్మాణం లో ఉన్న శ్రీ వారి ఆలయ పనులను ఇటీవల టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పరిశీలించి వచ్చారు.