home page

'దిశ 'పోలీసు స్టేషన్లో హోంమంత్రి

శాంతి భద్రతలు కట్టుదిట్టం చేశాం: తానేటి వనిత

 | 
Disha police station
విశాఖపట్నం,మిర్రర్ టుడే: ఎండాడ లోని దిశ పోలీస్ స్టేషన్ ను హోం శాఖ మంత్రి తానేటి వనిత శనివారం సందర్శించారు. మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం దిశ పోలీస్ స్టేషన్లు ప్రత్యేకంగా పూర్తిస్థాయి భద్రత కల్పిస్తాయనీ ఏపీ హోంశాఖ మంత్రి తెలిపారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ దిశ పోలీసు స్టేషన్ ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలని, పోలీసులను ఆదేశించారు. మహిళల భద్రత విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హోంమంత్రి హెచ్చరించారు. ఒక్కో దిశ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 38 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. వీళ్లంతా 24 గంటలూ... మహిళల భద్రత కోసం పనిచేస్తారనీ అన్నారు.