home page

బుల్డోజర్తో విధులు

పోటాపోటీగా శిబిరాలు

 | 
Boldoze
న్యూఢిల్లీ: హింసాత్మక నేరాల వంటి సంఘటనలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్లను కూల్చివేసేందుకు బుల్డోజర్లను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లామిక్ సంస్థ జమియత్ ఉలమా-ఎ-హింద్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

బుల్డోజర్‌లతో భయంకర రాజకీయాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆ సంస్థ క్రిమినల్ ప్రొసీడింగ్ సమయంలోనే నిందితులపై ముందస్తు చర్యలు తీసుకోవడం, వారిని శిక్షార్హంగా పరిగణించడం, నివాసాలను కూల్చివేయడం లాంటి చర్యలు చేపట్టకుండా భారత ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది.

ఈ విషయమై జమియత్ ఉలమా-ఎ-హింద్ అధ్యక్షుడు అర్షద్ మదాని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ''బుల్డోజర్ పేరుతో కొనసాగుతున్న భయంకరమైన రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని సుప్రీంకోర్టులో జమియత్ ఉలమా-ఎ-హింద్ పిటిషన్ దాఖలు చేసింది. నేరారోపణల నెపంతో మైనారీటీలపై ముఖ్యంగా ముస్లింలపై బీజేపీ అధికార రాష్ట్రాలు విధ్వంసానికి విధ్వేషానికి పాల్పడుతున్నాయి'' అని రాసుకొచ్చారు.