home page

విరాళం ఇచ్చిన దాతల పేరు పెట్టాలి: హైకోర్టు ఆదేశం

నెల్లూరు జిల్లాలో దాతపేరుపై వివాదం

 | 

జీఓ ఇచ్చి కూడా ఎందుకు అమలు చేయలేదు?

*అమరావతి (హైకోర్టు)*

_*అభివృద్ధిలో పాలుపంచుకునేవారికి ఇచ్చే గౌరవం ఇదేనా?*_

*పాఠశాలలకు విరాళాలిచ్చి, అభివృద్ధికి కృషిచేసిన దాతల పేర్లను ఆయా స్కూళ్లకు పెట్టేందుకు నిరాకరించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.*

*- దాతల అభ్యర్థనను తిరస్కరించడం సరికాదని హితవుపలికింది.*

*- రాష్ట్రంలో ఇలాంటి తరహా వ్యవహార శైలి కొనసాగితే .. విరాళాలు ఇవ్వడానికి , పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడానికి ఎవరూ ముందుకురానని స్పష్టం చేసింది.*

★ పాఠశాలలకు విరాళాలిచ్చిన దాతలు సూచించిన పేర్లను ఆయా విద్యాలయాలకు పెట్టేందుకు అధికారులు నిరాకరించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

★ కొర్రీలు వేసి దాతల అభ్యర్థనను తిరస్కరించడం సరికాదని హితవు పలికింది. 

★ రాష్ట్రంలో ఇలాంటి వ్యవహార శైలి కొనసాగితే విరాళాలివ్వడానికి, అభివృద్ధిలో భాగస్వాములవడానికి ఎవరూ ముందుకురారని స్పష్టం చేసింది. ప్రభుత్వ తీరుతో అంతిమంగా రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతుందని తెలిపింది. 

★ అభివృద్ధిలో పాలుపంచుకునేవారికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించింది. 

★ ఈ వ్యవహారంపై స్పష్టతనిచ్చేందుకు రికార్డులతో మే 5న న్యాయస్థానం ముందు హాజరుకావాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేశ్‌కుమార్‌ను ఆదేశించింది. 

★ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం ఈమేరకు ఆదేశాలనిచ్చారు.

★ నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట జడ్పీ ఉన్నత పాఠశాల పేరును తన తండ్రి నారపరెడ్డి సీతారామిరెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలగా మార్చాలంటూ 2021 సెప్టెంబరులో ఆయన కుమారుడు, మాజీ సర్పంచి కిరణ్‌కుమార్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 

★ ఈ మేరకు తాను చేసిన అభ్యర్థనను పాఠశాల కమిషనర్‌ తిరస్కరించడాన్ని సవాలు చేశారు. 

★ పాఠశాలను దత్తత తీసుకొని రూ.41 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. 

★ ఆర్థికసాయం చేసినందుకు తన తండ్రి పేరును పాఠశాలకు పెట్టాలని విన్నవించారు. 

★ ఈ మేరకు పాఠశాల నిర్వహణ కమిటీ, గ్రామపంచాయతీ 2021 సెప్టెంబరు 6న తీర్మానించిందని పేర్కొన్నారు. 

★ పేరు మార్పునకు డీఈవో సైతం గుంటూరు ఆర్జేడీకి లేఖ రాశారని తెలిపారు.

★ ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ వినతిని తిరస్కరిస్తూ ఏప్రిల్‌ 28న విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారని చెప్పారు. 

★ గుంటూరు ఆర్జేడీ ప్రతిపాదన 2021 నవంబరు 29న అందిందని తెలిపారు. 

★ రూ.10లక్షలు.. ఆపైన విలువైన భూమి, భవనం, ఆర్థికసాయం చేసిన దాతల పేర్లు పెట్టేందుకు వీలుగా 2004 నవంబరు14న ఇచ్చిన జీవో 162 స్థానంలో 2021 అక్టోబరు 6న జీవో13ను తెచ్చామని అన్నారు. 

★ జీపీ వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. జీవో13 ప్రకారం రూ.3 కోట్లు విరాళంగా ఇస్తేనే పాఠశాల పేరుపై హక్కులు కల్పిస్తామన్నట్లు కనిపిస్తోందని అన్నారు. 

★ పిటిషనర్‌ పాఠశాల పేరు మార్పునకు జీవో13 జారీకి ముందే 2021 సెప్టెంబరు7న వినతినిచ్చారని గుర్తుచేశారు. 

★ అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల్లో జాప్యం చేసి పిటిషనర్‌ వినతిని తిరస్కరించడం సరికాదని పేర్కొన్నారు.