home page

అగమ్య గోచరమైన ఆంధ్రప్రదేశ్

ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం

 | 

అగమ్య గోచరంగా ఆంధ్ర ప్రదేశ్ ఆదాయ పరిస్థితి 
టైం కీ జీతలు ఈ వ్వ లేని దుస్థితి... కేంద్ర మంత్రి 

(రాజ పెంటపాటి బ్యూరో చీఫ్) 

అమరావతీ ఫిబ్రవరి 12( మిర్రర్ టుడే);

వైకాపా ప్రభుత్వంపై కేంద్రమంత్రి దేవ్‌సింహ్‌ చౌహాన్‌ విమర్శలు గుప్పించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. పూర్తిగా దివాలా తీసిందన్నారు

వాలంటీర్ల ద్వారా విపక్ష నేతలను భయపెడుతున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని వాసవీ కల్యాణ మండపంలో ఈ రొజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో మద్యం, ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఆ ఆదాయమంతా ఎక్కడికి పోతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీద ఉన్నారని, వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. 10వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు.

దేశంలో తొమ్మిదేళ్ల మోదీ సాంకేతికతతో కూడిన పారదర్శక పాలన అందిస్తున్నారని తెలిపారు. ఒక వ్యక్తి, ఒక వర్గం కాకుండా అందరూ ఎదగడానికి  కృషి చేస్తోందన్నారు. . కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు విట్టా రమేశ్‌, రాష్ట్ర నాయకులు పార్థసారథి, జిల్లా అధ్యక్షుడు రామస్వామి, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ జైన్‌ పాల్గొన్నారు.