home page

అందరూ మెచ్చే చిత్రం 'వారసుడు'

 | 
వారసుడు :రివ్యూ, రేటింగ్: (3/5) ఎన్ని కుటుంబం కధలు వచ్చిన ఉమ్మడి కుటుంబం నుంచి సంక్రాతి, లక్ష్మి అన్నయ్య,ట్రెండ్ ని బట్టి, జనరేషన్ ని బట్టి కధ వస్తువులు మారతాయి తప్పు ప్రేమ ఆప్యాయత అనురాగం మారవు..తల్లి పాత్ర గొప్పది.కుటుంబం కధ చిత్రాలు చాలా గొప్పవి.. ప్రతి ఇంటిలో ఉండే పాత్రలు కనిపించడం సహజం......

                      నటీనటులు: విజయ్‌, రష్మిక మందన్నా, శరత్‌ కుమార్, ప్రకాశ్‌రాజ్‌, ప్రభు, శ్రీకాంత్‌, జయసుధ, సుమన్, శ్యామ్, యోగిబాబు తదితరులు

నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్

నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్

దర్శకత్వం: వంశీ పైడిపల్లి

సంగీతం: తమన్

సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని 

ఎడిటర్: ప్రవీణ్ కేఎల్ కధ :శరత్‌కుమార్(రాజేంద్ర) ఓ పెద్ద బిజినెస్‌ మ్యాన్. అతని భార్య జయసుధ(సుధ). వీరికి ముగ్గురు కుమారులు. విజయ్(విజయ్), శ్రీకాంత్(జై), శ్యామ్(అజయ్). పెద్ద పెద్ద మైనింగ్ కాంట్రాక్టులు డీల్ చేస్తుంటారు. రాజేంద్రతో జయప్రకాశ్(ప్రకాశ్ రాజ్) బిజినెస్‌లో పోటీ పడుతుంటాడు. రాజేంద్రతో పాటు శ్రీకాంత్, శ్యామ్ బిజినెస్‌ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు..ముగ్గురు కుమారులు కావడంతో వారసుడిని ప్రకటించి బిజినెస్‌ను ఎవరికీ అప్పగించాలనే ఆలోచిస్తూ ఉంటాడు రాజేంద్ర. కానీ విజయ్‌కు తన తండ్రి వ్యాపారంలో కొనసాగడం ఇష్టం లేదని చెప్పడంతో ఇంటి నుంచి వెళ్లిపోమంటాడు రాజేంద్ర. ఆ తర్వాత సొంతంగా ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభిస్తాడు.కానీ శరత్ కుమార్ కి కాన్సర్ అని ప్రభు చెబుతారు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు అని అంటారు.ఆలా వెళ్లిన కొడుకు విజయ్ ఇంటికి రాక 7ఇయర్స్ అవుతుంది, షష్టిపూర్తి చేసుకొంటే అలాగ అయ్యన కొడుకు వస్తారు అని శరత్ కుమార్ ని అడుగుతుంది, ఒప్పుకొంటారు. షష్ఠిపూర్తి విజయ్ వస్తారు. అక్కడ బాగా గొడవ అవుతుంది. పెద్ద కొడుకు వేరే అమ్మాయి తోటి అక్రమ సంబంధం, కోడలు విడాకులు, రెండు కొడుకు వేరే వాళ్ళు దగ్గర 500 కోట్లు అప్పు చేసి వాళ్ళు వచ్చి అడిగి గొడవ పడతారు. అప్పుడు శరత్ కుమార్ వీళ్ళు నా కంపెనీ కి వారసుడు కాదు అని బాధ పడతారు విజయ్ కి అప్పుడు తనకు కాన్సర్ ఉంది అని చెప్పి కంపెనీ కి వారసుడు విజయ్ అని ప్రకటిస్తారు.అప్పుడు విజయ్ వాళ్ళు ప్రాబ్లెమ్ ని సాల్వ్ చేసి వాళ్ళు ని సరియైన దారిలోకి తీసుకోని వస్తారు.శ్రీకాంత్ వాళ్ళు అమ్మాయి ని రౌడీ ల నుంచి కాపాడి, రెండో అన్న అజయ్ ని ప్రకాష్ రాజ్ నుంచి కాపాడి టెండర్ కి ఇన్వెస్ట్మెంట్ పెడతానికి ముంబై నుంచి మిట్టల్ అని విజయ్ ఫ్రెండ్ వస్తే అతను తోటి డ్రామా ఆడి విజయ్ కంపెనీ కి టెండర్ దక్కించుకొంటారు. హీరయిన్ 7ఇయర్స్ క్రితం పరిచయం శ్రీకాంత్ మరదలు లవ్ లో ఉంటారు.. స్టార్ట్ అప్ కంపెనీ కి 250 కోట్లు వచ్చాయి అని తను పేపర్ లో చూసి పేపర్ తీసుకోని వచ్చి బాగా దగ్గర అవుతుంది..శరత్ కుమార్ విజయ్ ని ఒక్కటే అడుగుతాడు ప్రశాంతచావు (మరణం).. ప్రకాష్ రాజ్ ని కూడా మార్చి వస్తారు. జయప్రద నువ్వు వచ్చింది నాకోసం కాదు మీ నాన్న కోసం అని అంటుంది. ఆస్తికలు కాశీ లో ముగ్గురు కొడుకులు కలపడం తోటి కధ ముగుస్తుంది . కానీ ఎన్ని కుటుంబం కధ లు వచ్చిన ట్రెండ్ ని బట్టి కధ వస్తువులు మారతాయి తప్పు ప్రేమ ఆప్యాయత అనురాగం మారవు...

పోరెళ్ల సాంబశివరావు

...

Porella. Sambasivarao MSc MBA cinima Analyst Hyderbad 9290556685Varasudu1