home page

యాదాద్రి లోనే నిత్యకళ్యాణం

ఆలయ ధర్మాలు పాటించాలని ఆదేశాలు

 | 
పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణం, శ్రీసుదర్శన నారసింహ హోమం పర్వాలను సోమవారం నుంచి యాదాద్రి ప్రధానాలయంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ప్రధానాలయ పునర్నిర్మాణం నేపథ్యంలో తొలుత ఈ పర్వాలను బాలాలయంలో కొనసాగించారు. ఇక ఆలయ ఉద్ఘాటన సమయంలో.. ఉద్ఘాటన పూర్తయ్యాక నిత్యకల్యాణం, హోమాన్ని పాతగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్నారు.

ఈ నెల 18న నరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి కావడంతో ఆ రోజు నుంచి నిత్యకల్యాణం, హోమం, అలంకార సేవోత్సవాలను పునర్నిర్మించిన యాదాద్రీశుడి ప్రధాన క్షేత్రంలోనే చేపట్టాలని దేవస్థానం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు, పూజారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు సెలవు రోజులు కావడంతో యాదాద్రికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. అయితే కొండపైకి ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేకపోవడం, కొండపైన తగిన సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయ ఈవో గీతారెడ్డికి వ్యతిరేకంగా కొద్దిరోజులుగా అక్కడి స్థానికులు నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.