home page

విపక్షాలతో కెసిఆర్ మంతనాలు

మమతాబెనర్జీ, ఆర్జేడి అధినేతలతో మాటామంతీ 

 | 
Kcr
కేంద్రంపై సీఎం కేసీఆర్ స‌మ‌ర‌శంఖం.. పలువురు సీఎంల‌తో ఫోన్లో మంత‌నాలు
కేంద్రం అనుస‌రిస్తున్న అసంబద్ధ వైఖ‌రిపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌ర‌శంఖం పూరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా క‌లిసి వ‌చ్చే అన్ని రాష్ట్రాల విప‌క్ష పార్టీల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. పోరుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తున్న బీజేపీ విధానాల‌ను కేసీఆర్ ఎండ‌గ‌ట్ట‌నున్నారు. 
దేశంలో ప్రమాదంలో పడుతున్న ఫెడరల్, సెక్యులర్ ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తన ప్రయత్నాలకు కేసీఆర్ మ‌రింత ప‌దును పెట్టారు. ఆర్థిక సంక్షోభంలోకి దేశాన్ని నెట్టివేస్తున్న కేంద్ర వైఖరిని తేటతెల్లం చేసేందుకు కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను వేదిక‌గా చేసుకుని బీజేపీ ప్ర‌భుత్వంపై పోరాటం చేయ‌నున్నారు. బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక దమననీతిని తీవ్రంగా ఖండిస్తూ.. దేశవ్యాప్త నిరసనలతో కేంద్రం అసలు స్వరూపాన్ని నగ్నంగా నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.
కేంద్రంపై పోరాటానికి క‌లిసి రావాలి..
ఈ క్ర‌మంలో దేశంలోని ప‌లు రాష్ట్రాల విప‌క్ష నేత‌ల‌తో కేసీఆర్ ఈ ఉద‌యం ఫోన్‌లో మాట్లాడారు. శుక్రవారం ఉద‌యం పలువురు ముఖ్యమంత్రులతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. జాతీయ నేతలతోనూ సీఎం చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్, బీహార్ ఆర్జేడీ నేత తేజ‌స్వీయాద‌వ్, యూపీ ప్ర‌తిప‌క్ష నేత అఖిలేష్ యాద‌వ్, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌తో పాటు ప‌లువురు జాతీయ నాయ‌కుల‌తో కేసీఆర్ స్వ‌యంగా ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రంపై పోరాటానికి క‌లిసి రావాల‌ని కేసీఆర్ వారిని కోరారు.
సానుకూల స్పంద‌న‌..
కేంద్రంపై ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌లు సానుకూలంగా స్పందిస్తున్నారు. కేంద్రం మెడలువంచి దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడే దిశగా అన్ని విపక్ష పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు మంత‌నాలు కొన‌సాగుతున్నాయి. అటు వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మంత్రులు, అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూనే.. ఇటు బీజేపీ అప్రజాస్వామిక విధానాల విపత్తు నుంచి దేశాన్ని కాపాడేందుకు పార్లమెంట్ వేదికగా పోరాటం చేసేందుకు కేసీఆర్ అంద‌ర్నీ స‌న్న‌ద్ధం చేస్తున్నారు.