ఆంధ్రాలో అన్నతో తేల్చుకోవాలి : షర్మిల కు కెటిఆర్
షర్మిల, కేఏపాల్ ,ప్రవీణ్ మాకు ప్రత్యర్ధులా?
Apr 23, 2022, 09:39 IST
| ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ వైఎస్సార్టీటీపీ నాయకురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన అన్నతో గొడవ వుంటే ఆంధ్రాలో తేల్చుకోవాలేకానీ తెలంగాణ లో తిరగడం ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ఆమె పాదయాత్ర వల్ల తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆయన అన్నారు . తెలంగాణ లో తమకు కేఏపాల్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లే ప్రత్యర్ధులు అయ్యేటట్లు ఉన్నారని ఆయన అన్నారు.